Wednesday, September 8, 2021

How to Take Your Time - Alain de Botton

ప్రూస్ట్ రాసిన పుస్తకాల సైజు చూసి ఆయన్నీ, జాయిస్ నీ, ఈ తరహా సుదీర్ఘమైన రచనలు చేసే క్లబ్బుకి చెందిన మరి కొందరు రచయితల్నీ బాధ్యతలన్నీ తీరిపోయి రిటైర్ అయ్యాక తీరుబడిగా చదువుదామని అనుకున్నాను. ఈలోగా, అనుకోకుండా బ్రిటిష్ తత్వవేత్త అలైన్ డి బటన్ రాసిన 'How Proust Can Change Your Life' అనే పుస్తకం కంటబడింది. "ప్రూస్ట్ ని ఎందుకు చదవాలి ?" అనే దిశగా రాసిన పుస్తకంలా అనిపించిన ఆ టైటిల్ నన్ను చాలా ఆకర్షించింది. సినిమా ముందు టీజర్ లా ఈ పుస్తకం చదివితే ప్రూస్ట్ రాసిన బృహద్గ్రంథాలని ఇంకొంచెం సులభంగా చదవవచ్చునేమో అన్న ఆలోచన వచ్చింది. మరో కారణం ఏమిటంటే, గత ఏడాది ప్రూస్ట్ రాసిన 'డేస్ ఆఫ్ రీడింగ్' చదివాను. అందులో జిగిబిగి అల్లికల చిక్కని వచనం నన్ను చాలా ఇబ్బంది పెట్టింది. చిక్కుముడులు విడదీసుకుంటూ, కొన్ని పంక్తులకు ఆదీ-అంతం ఎక్కడో వెతుక్కుంటూ ఆ పుస్తకం పూర్తి చేసేసరికి నా తలప్రాణం తోక్కొచ్చింది. ఏదైతేనేం "ప్రూస్ట్ ని చదవడం అంత వీజీ కాదు" అనే విషయం స్పష్టంగా అర్థమైపోయింది. 

Image Courtesy Google

పోనీ కాస్త ఓపిక చేసుకుని క్లాసిక్స్ కాబట్టో, తరాలుగా పాఠకుల మన్ననలందుకుంటున్న రచనలనో చదువుదామనుకున్నా ఆ భారీ వాలూమ్స్ చూస్తే ఎవరికి మాత్రం భయమెయ్యదూ !! "చదివితే చదవాలి,లేదా ప్రక్కన పడెయ్యాలి, అంతేగానీ ఒక పుస్తకం చదవడానికి ఇంత ఆలోచన అవసరమా" అంటారా ! మిగతావాళ్ళ సంగతి ప్రక్కన పెడితే ప్రూస్ట్ విషయంలో ఖచ్చితంగా అవసరమే. అసలు ఇక్కడ సమస్య ఏమిటంటే దొరికే కాస్త ఖాళీ సమయంలో ఒక వందా, పోనీ రెండు వందలు, అదీ కాకపోతే పోనీ మరో వంద కలుపుకుని మూడు వందలనుకుందాం. కనీసం మూడొందల పేజీలున్న ఒక పుస్తకాన్ని నేను చదివినట్లు తాబేలు వేగంతో చదవడానికి ఎంత సమయం వెచ్చించాలి!! అసలే కాలమూ, దాని విలువా తెలిసిన పిసినారిని, స్వార్థపరురాలిని. చేతికి కలం, కాగితం దొరికాయి కదాని బొత్తిగా పొదుపుకి అర్థం తెలీకుండా, పాఠకులపై కొంచెం కూడా దయాదాక్షిణ్యాలు లేకుండా ప్రూస్ట్ పేజీలకు పేజీలు రాసి పడేసిన బృహద్గ్రంథాలను నా విలువైన సమయం వెచ్చించి అసలు నేనెందుకు చదవాలి? (బృహద్గ్రంథాలు అని ఊరికే అనడం లేదు, ఆయన 'In Search of Lost Time' పేజిల కౌంటు వికీలో చూస్తే అక్షరాలా నాలుగు వేల రెండువందల పదిహేను పేజీలు.)

1913 లో ప్రూస్ట్ ఏడు వాల్యూముల 'In Search of Lost Time' ని ప్రచురించడానికి ఆయన స్నేహితుడు లూయిస్ డి రాబర్ట్ ఆయనకు సహాయపడదామనుకున్నారట. లూయిస్ తన రచనల్ని ప్రచురించే ప్రముఖ సంస్థ 'ఓలెన్ డోర్ఫ్'కు ఆ ప్రతుల్ని పంపినప్పుడు ప్రచురణ సంస్థ యజమాని ఆల్ఫ్రెడ్ హమ్బ్లోట్ అటువంటి విచిత్రాన్ని (వైపరీత్యం అనాలేమో :) ) మునుపెన్నడూ చూడక పాపం నోరెళ్ళబెట్టారట. మొహమాటం కొద్దీ వాటిని కొంత చదివిన తరువాత ఆయన, 

“My dear friend, I may be dense,” replied Humblot after taking a brief and clearly bewildering glance at the opening of the novel,“but I fail to see why a chap needs thirty pages to describe how he tosses and turns in bed before falling asleep.” అన్నారట :) 

ఇలా అన్నది ఆయనొక్కరే అనుకుంటే పొరపాటే. పై ఉదంతం జరిగిన కొన్ని మాసాల ముందు  ఫాస్కేల్లే అనే మరో ప్రచురణ సంస్థకు చెందిన పాఠకుడు జాక్వెస్ మడెలైన్ ఇవే ప్రతుల మోపుని చదివే సాహసం చేశారు. ఆయన స్పందన ఏమిటంటే,

“At the end of seven hundred and twelve pages of this manuscript,” he had reported, “after innumerable griefs at being drowned in unfathomable developments and irritating impatience at never being able to rise to the surface—one doesn’t have a single, but not a single clue of what this is about. What is the point of all this? What does it all mean? Where is it all leading? Impossible to know anything about it! Impossible to say anything about it!” అంటూ కళ్ళు తేలేశారట.

ఇక సాక్షాత్తూ ప్రూస్ట్ సోదరుడు రాబర్ట్ మాటల్లో చెప్పాలంటే : "బాధాకరమైన విషయం ఏమిటంటే ప్రూస్ట్ రాసిన 'In Search of Lost Time' చదవాలంటే పాఠకులు చాలా తీవ్రమైన అనారోగ్యంతోనో లేదా కాలు విరిగిపోయి దీర్ఘకాలం మంచంపట్టి ఉంటేనో తప్ప వీలుపడదు."

And as they lie in bed with their limb newly encased in plaster or a tubercle bacillus diagnosed in their lungs, they face another challenge in the length of individual Proustian sentences, snakelike constructions, the very longest of which, located in the fifth volume, would, if arranged along a single line in standardized text, run on for a little short of four meters and stretch around the base of a bottle of wine seventeen times.

ఇక ప్రూస్ట్ ప్రతుల్ని చదివి విరక్తి చెందిన మరో అందమైన యువతి ఆయనకు స్వయంగా ఉత్తరం రాసి,

“I don’t understand a thing, but absolutely nothing. Dear Marcel Proust, stop being a poseur and come down to earth. Just tell me in two lines what you really wanted to say.”అని అందట.

ఇవన్నీ చదివి నాకు మహదానందం కలిగింది. ఆయన వచనం మింగుడుపడనిది నాకు మాత్రమే  కాదన్నమాట! కానీ ఇంతమంది విమర్శించినా పాఠకుల సహనాన్ని పరీక్షించే ప్రూస్ట్ వచనాన్ని చదవడం లాభదాయకమైన వ్యవహారమే అంటారు అలైన్ డి బటన్. అది ఎందుకో తెలియాలంటే ఈ పుస్తకం తప్పకుండా చదవాలి. ఫాస్ట్ ఫుడ్, ఫాస్ట్ లైఫ్, ఫాస్ట్ అఫైర్స్ ఇలా అన్నీ సూపర్ ఫాస్ట్ గా జరిగిపోతున్న ఈ తరంలో ప్రూస్ట్ లాంటి రచయితల్ని చదవడం మరింత అవసరం. n’allez pas trop vite (Don't go very fast) అనే ప్రూస్ట్ స్లోగన్ జీవితాన్ని నెమ్మదిగా ఆస్వాదిస్తూ జీవించమని బోధిస్తుంది. వేగాన్ని తగ్గించి మెల్లిగా జీవితాన్ని ఆస్వాదిస్తూ జీవించడంలో ఉన్న ప్రయోజనం ఏమిటంటే, ప్రపంచం మరింత ఆసక్తికరంగా మారే అవకాశం ఉంటుంది అంటారు బటన్. ఈ  పుస్తకంలో ప్రూస్ట్ శైలి గురించే కాకుండా ఆయన జీవన విధానాన్నీ, అలవాట్లనూ, తన చుట్టూ ఉన్న ప్రపంచం పట్ల నిబద్ధతతో కూడిన ఆయన గమనింపునూ ప్రస్తావిస్తారు బటన్. 'వింటేజ్ షార్ట్స్' సిరీస్' లో భాగంగా పెంగ్విన్ రాండమ్ హౌస్ వారు ప్రచురించిన ఈ 'How to Take Your Time' (How Proust Can Change Your Life నుండి సంగ్రహించబడింది) ప్రూస్ట్ ని చదవడానికి  మరోసారి ప్రయత్నించాలనే ఆసక్తి  కలుగజేసింది. ఈ చిన్ని పుస్తకాన్ని ఎయిర్పోర్ట్ లోనో, రైల్వే స్టేషన్లోనో వెయిటింగ్ సమయంలో హాయిగా చదివేసుకోవచ్చు. హ్యాపీ రీడింగ్. :)

పుస్తకం నుండి మరి కొన్ని నచ్చిన అంశాలు : 

Madeleine nevertheless had a go at summarizing the events of the first seventeen pages: “A man has insomnia. He turns over in bed, he recaptures his impressions and hallucinations of half-sleep, some of which have to do with the difficulty of getting to sleep when he was a boy in his room in the country house of his parents in Combray. Seventeen pages! Where one sentence (at the end of page 4 and page 5) goes on for forty-four lines.”

Proust’s novel ostensibly tells of the irrevocability of time lost, of innocence and experience, the reinstatement of extra-temporal values and time regained. Ultimately the novel is both optimistic and set within the context of human religious experience.

These literary quotations were not simply designed to impress (though Proust did happen to feel that “one must never miss an opportunity of quoting things by others which are always more interesting than those one thinks up oneself”)

The truth is that as we grow older, we kill all those who love us by the cares we give them, by the anxious tenderness we inspire in them and constantly arouse.”

Friday, September 3, 2021

Notes from the Hinterland : Stories and Essays - Shashi Tharoor

వర్చ్యువల్ రియాలిటీకీ వాస్తవానికీ తేడా పూర్తిగా చెరిగిపోయిన ఈ తరంలో ఫేస్బుక్ కిటికీల్లోంచి చూసే జీవితాలకీ వాస్తవ జీవితాలకీ ఎంత ఉంటుందో, అధికార పక్షాల గుప్పిట్లో చిక్కుకున్న మీడియా చూపించే ప్రతిబింబాలకీ,వాస్తవానికీ కూడా అంతే తేడా ఉంటుంది. జాతీయ రహదారుల్లో ప్రయాణిస్తూ ఏసీ కారుల అద్దాల్లో నుండి ప్రపంచాన్ని చూసే ఉంటారు, ఎటుచూసినా శుభ్రంగా,అందంగా ఉంటుంది. కానీ కారు దిగి రహదారులు దాటుకుని ఇరుకు సందుల గుండా మురికివాడల్లో కాళ్ళకు చెప్పులు లేకుండా మండుటెండలో నడిస్తేనే గానీ దాని నిజస్వరూపం తెలియదు. మన దేశ వాస్తవిక స్థితి క్యాపిటలిజం కొలువుదీరిన ఆకాశహర్మ్యాల్లో కంటే  ముంబై లోని ధారావి,ఢిల్లీ లోని కుసుంపూర్ పహాడీ లాంటి మురికివాడల్లోనూ, బళ్ళారి వైపు గనుల్లో కార్మికుల ప్లాస్టిక్ గుడారాల్లోనూ ఎక్కువ కనిపిస్తుంది. కోవిడ్ సెకండ్ వేవ్ లాక్ డౌన్ సమయంలో నేను చదివిన కొన్ని మంచి పుస్తకాలలో ఈ 'నోట్స్ ఫ్రమ్ ది హింటర్ల్యాండ్' ఒకటి. ఈ పుస్తకం కాలు కదపకుండా ఇంట్లో కూర్చున్న పాఠకులకు భారతీయ సహజ స్వరూపాన్ని ప్రత్యక్షంగా చూసిన అనుభవాన్నిస్తుంది. నాకు తెలిసిన సుందర భారతం ఎవరమూ గుర్తుపట్టలేని విధంగా ఈ ఏడాది మరీ వికృతంగా మారిపోవడంవల్ల కావచ్చు,ఎప్పుడూ లేని విధంగా ఈ నెలలో భారతీయ రచయితల పుస్తకాలపై మనసుపోయింది. బహుశా కరోనా తరంగాల తాకిడిలో కొట్టుకుపోయిన గతించినకాలపు సహజమైన జీవనశైలినీ,జీవితానుభవాలనూ తిరిగి వెతుక్కునే ప్రయత్నం కావచ్చు.

Images Courtesy Google

ఈ పుస్తకంలో కొత్త నీరూ,పాత నీరూ పాయలుగా కలుపుతూ పలు భారతీయ రచయితలు రాసిన మొత్తం పది కథలున్నాయి. వీటిల్లో తెలుగు రచయిత దేవరకొండ బాలగంగాధర తిలక్ రాసిన ఒక కథ ఉండడం విశేషం. చక్కని అనువాదంతో కూడిన తిలక్ కథను చదివి చాలా సంతోషమేసింది. పేరుకి అతి పెద్ద ప్రజాస్వామ్యమైనా భారతదేశాన్ని ప్రత్యక్షంగా శాసించేవి ముఖ్యంగా రెండే రెండు అంశాలు : ఒకటి కులం,రెండవది మతం. ఇక మూఢనమ్మకాలూ,ఛాందస భావాలూ, స్వార్థపరత్వంలాంటివి పరోక్షంగా తమ వంతు పాత్రను ఎటూ పోషిస్తాయి. వీటి బారినపడిన ప్రజాస్వామ్యం దిక్కులేక కొన ఊపిరితో కొట్టుకుంటూ  ప్రపంచానికి గర్వంగా తన అస్తిత్వాన్ని చాటుకుంటుంటుంది. ఈ రచనలో తిలక్,శ్రీలాల్ శుక్లా,రస్కిన్ బాండ్,శశి థరూర్, రహి మసూమ్ రజా వంటి కొందరు రాసిన కథలు కాల్పనికతకు దూరంగా వాస్తవికతకు అద్దంపట్టేవిగా ఉంటాయి. వీటితోబాటు పాలగుమ్మి సాయి నాథ్ (మరో తెలుగాయన :) ) ,అభిమన్యు కుమార్ వంటి జర్నలిస్టులు రాసిన వాస్తవిక అనుభవాలతో కూడిన వ్యాసాలు కొన్ని ఉన్నాయి.

ఈ పుస్తకానికి సంపాదకత్వం చేసిన శశి థరూర్ రాసిన వ్యాసం లాంటి కథ 'Scheduled Castes, Unscheduled Change' తో ఇందులో కథలు మొదలవుతాయి. ఈ కథను నేను ఇది వరకే మరొకచోట చదివాను. ఇదే కథను అనితా నాయర్ ఎడిట్ చేసిన 'Where the Rain is Born: Writings about Kerala' అనే పుస్తకంలో 'ఛార్లీస్ అండ్ ఐ' పేరుతో ప్రచురించారు. అప్పట్లో చాలా నచ్చి అనువాదం చేద్దామనుకున్నా వీలుపడలేదు. కేరళలో బలంగా వ్రేళ్ళూనుకుపోయిన వర్ణ వ్యవస్థలో కాలానుగుణంగా వచ్చిన మార్పులను థరూర్ కేరళలో తన బాల్యానుభవాలతో ముడిపెడుతూ వివరించిన కథ ఇది. శశి థరూర్ అనగానే ఆయన సిగ్నేచర్ ఆంగ్ల పదగాంభీర్యాలు గుర్తొచ్చి, పేజీకో పదిసార్లు ఆక్స్ఫర్డ్ డిక్షనరీ తిరగేసే ఓపిక లేక ఆయన రచనలేవీ చదివే సాహసం ఎప్పుడూ చెయ్యలేదు. కానీ ఈ కథ చదివినప్పటినుండీ థరూర్ మరికొన్ని కథలను చదవాలనే ఆసక్తి కలిగింది. ఈ కథలో ఆయన నేరేషన్ చాలా సహజత్వంతో సరళమైన పదాలతో ఒక ప్రవాహంలా సాగుతుంది.

రస్కిన్ బాండ్ రాసిన రెండో కథ 'The Night Train at Deoli' లో కాలేజీ కుర్రవాడైన కథానాయకుడు వేసవి సెలవుల్లో డెహ్రాడూన్ లో తన అమ్మమ్మతో గడపడానికి వెళ్ళే ట్రైన్ డియోలీ అనే స్టేషన్ దగ్గర ఆగుతుంది. "Why it stopped at Deoli, I don’t know. Nothing ever happened there. Nobody got off the train and nobody got on." అనుకుంటుండగా ఆ స్టేషన్ ప్లాట్ఫారం మీద వెదురుబుట్టలు అమ్ముకుంటూ ఆకర్షణీయమైన చారడేసి కళ్ళ అమ్మాయి కనిపిస్తుంది. ఇద్దరి మధ్యనా పెద్ద సంభాషణ జరగపోయినా ఆమె రూపం అతడి మనసులో ముద్రపడిపోతుంది. ఈలోగా ట్రైన్ కదిలిపోతుంది. మళ్ళీ రెండు నెలల తరువాత తిరుగు ప్రయాణంలో అదే స్టేషన్ దగ్గర ట్రైన్ ఆగినప్పుడు అతడి కళ్ళు ఆమెకోసం ఆత్రంగా వెతుకుతాయి. విచిత్రంగా ఆమె మళ్ళీ చిరునవ్వు నవ్వుతూ కనపడుతుంది. ఆమెతో మాటలు కలుపుతూ,"నేను ఢిల్లీ వెళ్ళాలి, మళ్ళీ వస్తాను,నువ్వు  ఇక్కడ ఉంటావు కదా" అని మాట తీసుకుంటాడు. మళ్ళీ ట్రైన్ కదిలిపోతుంది. మళ్ళీ ఏడాది కాలేజీకి సెలవులివ్వగానే అతడు ఆమెను చూస్తాననే నమ్మకంతో ప్రయాణమవుతాడు. ఈ కథకు ముగింపు చదవాల్సిందే. బాండ్ తన కథల్లో ప్రకృతి వర్ణనల సున్నితత్వంతో పోటీపడుతూ తొలిప్రేమ తాజాదనాన్ని వర్ణించిన తీరు అమితంగా ఆకట్టుకుంది. ఇందులో మూసపోసినట్లుండే కథల్లో కాస్త భిన్నమైన కథ ఇదొక్కటే.

మూడో కథ ఆర్.కె.నారాయణ్ రాసిన 'An Astrologer’s Day' మాల్గుడి తరహా భారతీయ గ్రామీణ వాతావరణాన్ని మరోసారి గుర్తుచేస్తుంది. ఆయన కథల్లో నేపథ్యానికీ,పరిసరాల వర్ణనలకూ పెద్ద పీట వేస్తారని మనకందరికీ తెలిసిన విషయమే. ఈ కథలో చిన్న బజారులో మున్సిపాలిటీ వీధి దీపాలు లేకుండా కేవలం షాపుల్లో ఉన్న దీపాలతోనూ,గ్యాస్ లైట్ల వెలుతురుతోనూ నిండిన ఆ ప్రాంతాన్ని పాఠకుల మనస్సులో ఇట్టే చిత్రిస్తారు నారాయణ్.

నాలుగో కథ రంగా రావు గారు తెలుగు నుండి ఆంగ్లానికి అనువాదం చేసిన దేవరకొండ బాలగంగాధర తిలక్ రాసిన 'The Man Who Saw God' మానవత్వం గొప్పదా ? మతం గొప్పదా ? అనే ప్రశ్నల్ని మరోసారి రేకెత్తిస్తుంది. కరణాలూ,మునసబులూ,అవధానులూ వంటివారు సామజిక నియమాలను శాసిస్తూ  పంచాయితీలలో ప్రముఖపాత్ర పోషించే అలనాటి తెలుగు గ్రామీణ వాతావరణాన్ని ప్రతిబింబించే కథ ఇది. గవరయ్య నాస్తికుడు,తోలు వ్యాపారం చేస్తుంటాడు. ఊరందరిదీ ఒకదారైతే ఉలిపికట్టెది ఒకదారి అన్న తీరులో అతడు తన మానాన తాను బ్రతుకుతుంటాడు. భక్తీ, పాపభీతి లేని కారణంగానే అతడి వయసులో సగం వయసున్న భార్య టైలరుతో వెళ్ళిపోయిందని అంటూ అతడిలో మార్పు తీసుకురావడానికి కంకణం కట్టుకుంటారు ఊరిపెద్దలు. ఈలోగా గవరయ్య భార్య నిండు గర్భిణిగా దీనమైన స్థితిలో ఇంటికి తిరిగి వస్తుంది. ఆ తరువాతేమి జరిగిందనేది మిగతా కథ. ఈ కథ మానవత్వానికీ, మత మౌఢ్యానీకీ మధ్య జరిగే సంఘర్షణనను చూపిస్తుంది.

ఐదో కథ ప్రముఖ ఉర్దూ కవీ,రచయితా రహి మసూమ్ రజా రాసిన 'A Village Divided' ను Gillian Wright ఆంగ్లంలోకి అనువదించారు. మసూమ్ రజా పేరు వినగానే దూరదర్శన్ లో వచ్చిన చోప్రా  'మహాభారత్' కు రాసిన స్క్రీన్ ప్లే గుర్తొస్తుంది. మతంపేరుతో విషం కక్కే సమాజంలో ఇలాంటివి నిజంగా అద్భుతాలు అనిపిస్తాయి. ఈ కథలో రజా స్వస్థలమైన ఘాజీపూర్ నుండి బ్రతుకుతెరువుకు కోల్కతా,ముంబై,కాన్పూర్ వంటి చోట్లకు జనపనార మిల్లులో కార్మికులుగా పనిచేయడానికి వలస వెళ్ళే యువకుల గురించి రాస్తారు. అడుగడుగునా పద్యాన్ని తలపించే ఆయన గద్యం నాకు చాలా నచ్చింది.

Calcutta is not the name of a city. For the sons and daughters of Ghazipur it is another name for the yearning that comes of separation. This yearning is a whole story in itself, in which the kajal lining the eyes of countless women has been washed away by tears, and then dried. Every year thousands upon thousands of men far from home send back thousands upon thousands of messages with the monsoon clouds. Perhaps that’s why clouds burst over Ghazipur and, in these rains, seeds of yearning sprout in new and old walls, in the roofs of mosques and temples, in the cracks of school windows and doors, and the pain of separation awakes and begins to sing : 

No one stirs out in the monsoon rains,
Only you would leave for a distant land.

ప్రముఖ జర్నలిస్టు, రామన్ మెగసెసె అవార్డు గ్రహీత పి.సాయినాథ్ (పాలగుమ్మి సాయి నాథ్) రాసిన 'Ganpati Yadav’s Gripping Life Cycle' అనే కథ 'Everybody Loves a Good Drought' అనే కథల సంపుటి నుండి సంగ్రహించబడింది. మహారాష్ట్రలోని రామాపుర్ కి చెందిన 97 ఏళ్ళ రైతు /స్వాతంత్య్ర సమరయోధుడు గణపతి యాదవ్ అనుభవాలు అలనాటి స్వాతంత్య్ర సమరపు రోజుల్ని జ్ఞప్తికి తెస్తాయి. ఢిల్లీ కి చెందిన జర్నలిస్టు అభిమన్యు కుమార్ రాసిన వ్యాసం 'The Lynching That Changed India', స్నిగ్ధా పూనమ్ రాసిన 'The Man Who Lived' బీజేపీ అధికారంలోకి వచ్చిన నాటినుండీ మతంపేరిట జరుగుతున్న మరణహోమాల్ని కళ్ళకుకడితే, మాధురీ విజయ్ రాసిన 'Lorry Raja' కథ కర్ణాటక గనుల్లో పనిచేసే కార్మికుల దుర్భర జీవితాలకు అద్దం పడుతుంది. ఇక Gillian Wright హిందీ నుండి అనువదించిన శ్రీ లాల్ శుక్లా కథ 'Raag Darbari' భారత దేశంలో లంచగొండితనానీ,వ్యవస్థలో లొసుగుల్నీ చూపిస్తుంది. రెండు భిన్న తరాల రచయితలు రాసిన కథలు కావడంతో వీటిల్లో శైలుల వైరుధ్యం స్పష్టంగా కనిపించింది. సమకాలీన రచయితల కథలలో భాషా సౌందర్య లేమీ,లోతులేని ఉపరితలానికి పరిమితమైన  వర్ణనలూ స్పష్టంగా కనిపించాయి. ఏదేమైనా థరూర్ ఎంపిక చేసిన ఈ కథల్లో నాకైతే ఇది చెడ్డ కథ అని ఏమీ అనిపించలేదు. ఒక్కో కథా ఒక్కో ప్రత్యేకమైన శైలికీ,సంస్కృతికీ,కాలానికీ చెందినవైనా ఈ కథల సంకలనంలో అన్నీ కలిసి భారతీయ భిన్నత్వంలోని ఏకత్వాన్ని మరోమారు చాటి చెప్పాయి. భౌతిక స్వరూపం కంటే భారతీయ ఆత్మను పట్టి ఇచ్చే ఈ కథలన్నీ మనకు తెలిసిన భారతాన్ని సరికొత్త వెలుగులో చూపిస్తాయి.

Tuesday, August 17, 2021

On the Shortness of Life - Seneca

"He's a real nowhere man
Sitting in his nowhere land
Making all his nowhere plans for nobody
Doesn't have a point of view
Knows not where he's going to
Isn't he a bit like you and me?
Nowhere man please listen
You don't know what you're missing
Nowhere man, the world is at your command."

అంటూ జాన్ లెనన్ తాత్వికంగా రాసిన పాట రోమన్ తత్వవేత్త సెనెకా రచన 'On the Shortness of Life' చదువుతున్నప్పుడు పలుమార్లు గుర్తొచ్చింది. మనం నిత్యం మన ఆలోచనలు ఎటు తీసుకెళ్తే అటు పోతూ, చుక్కాని లేని నావలా గాలివాటుకి కొట్టుకుపోతూ ఉంటాం. ఒకవిధంగా మనిషి పుట్టిన నాటినుండీ మరణించే వరకూ తన ఆలోచనలకు కట్టు బానిసగా జీవిస్తాడు. తనను తాను జయించిన యోగికీ, సామాన్యుడికీ ఉన్న తేడా బహుశా ఇదొక్కటే కావచ్చు. చాలా సార్లు భౌతికంగా ఒకచోట ఉన్నా మనసు మాత్రం అనేక పరధ్యానాలతో ఎక్కడెక్కడో తిరుగుతూ ఉంటుంది. పసివాడిగా ఉన్నప్పుడు ఎప్పుడెప్పుడు పెద్దైపోయి ప్రపంచాన్ని జయించేస్తానా అని తొందర,పెద్దయ్యాకా ఎప్పుడెప్పుడు ఆకాశహర్మ్యాలు కట్టేస్తానా,రిటైర్మెంట్ కి ఎంత పోగుచేసుకుంటానా అని తపన. స్కూల్లో ఉన్నప్పుడు కాలేజీ రోజుల స్వేచ్ఛ కోసం, కాలేజీలో చదువుతున్నప్పుడు ఆర్ధిక స్వాతంత్య్రం కోసం ఇలా బహుశా అన్ని దశల్లోనూ మనిషి తానున్న చోటునుండి దూరంగా ఎడారిలో ఒయాసిస్ లా ఊరించే భవిష్యత్తును అందుకోవాలని పరిగెడుతూనే ఉంటాడు. ఇంతవరకూ బాగానే ఉంది. కానీ పరుగాపి అలసి సొలసి గమ్యం చేరగానే అతడి మనసులో తేనెతుట్టెను కదిపినట్లు అనేక ఆలోచనలు ముసురుకుంటాయి. 

"అసలెంత దూరం పరిగెత్తాను ! "

 "నా జీవిత కాలమంతా ఈ వ్యర్ధమైన పరుగుతోనే గడిచిపోయిందే !"

 "ఈ విరామ సమయంలో నేను చెయ్యాలనుకుని చెయ్యలేని పనులు అన్నీ చెయ్యడానికి నాకింకా ఎంత సమయం మిగిలుంది !"

 "నా జీవన ప్రమాణం మరికొంత పెరిగితే బావుణ్ణు, జీవితం ఎంత చిన్నది !!"

కానీ గడిచిపోయిన సమయం ఎప్పటికీ తిరిగిరాదు. అందుకే Living is the least important activity of the preoccupied man; yet there is nothing which is harder to learn. అంటారు సెనెకా.

Image Courtesy Google

బహు కొద్దిమంది మాత్రమే నిష్క్రమణను ఆగమనమంత హుందాగానూ తీసుకోగలరు. వాళ్ళకి మిగతావారికి భిన్నంగా జీవనప్రమాణం ఎక్కువేమీ ఉండదు, అందరికీ ఉండే 24 గంటలేగా వాళ్ళక్కూడా ఉంటాయి. కానీ వారి సమయాన్ని మిగతావారిలా  దుర్వినియోగపరుచుకోకుండా పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకున్నవాళ్ళు కాబట్టి అటువంటి వాళ్ళకు జీవితపు చరమాంకంలో పశ్చాత్తాపం లాంటి భావనలేవీ ఉండవు. ఎందుకంటే వాళ్ళకేం కావాలో వాళ్ళకు స్పష్టంగా తెలుసు. ఆదర్శవంతంగా జీవించడానికి అవసరమైన వివేకమో,కిటుకో వాళ్ళ దగ్గరేదో ఉంటుందేమో. ఈ పుస్తకంలో రోమన్ తత్వవేత్త సెనెకా తన అనుభవసారాన్నంతా రంగరించి అటువంటి కొన్ని కిటుకుల్ని చెబుతారు. 'పెంగ్విన్ గ్రేట్ ఐడియాస్' లో భాగంగా ప్రచురించిన సెనెకా రచన 'On the Shortness of Life' జీవితపు తొలిదశల్లో అందరూ తప్పకుండా చదవవలసిన పుస్తకం. 

కొన్ని నచ్చిన అంశాలకు నా స్వేచ్ఛానువాదం :

నువ్వు అమరుడిననుకుంటూ జీవిస్తున్నావు ; నీ ఉనికిలో అస్థిరత్వం నీకు తెలియదు సరికదా  ఎంత సమయం గడిచిపోయిందో నీకు కనీస స్పృహ కూడా లేదు, నీ వద్ద అపరిమితమైన సమయం ఉన్నట్లు దానిని వృధాగా విచ్చలవిడిగా ఖర్చు చేస్తున్నావు, అదే సమయంలో ఇదే చివరి రోజన్నట్లుగా నీ సమయాన్ని ఎవరో ఒకరికి ధారాదత్తం చేస్తున్నావు, లేదా ఏ ప్రాముఖ్యతా లేని అల్పమైన విషయాలపై పెడుతున్నావు. నీకు భయం కలిగించే విషయాల పట్ల నువ్వు మానవుడిలా వ్యవహరిస్తావు, నువ్వు కోరుకున్న విషయాల పట్ల మాత్రం అమరుడిననుకుంటావు.

పరధ్యానంతో ఉన్న మనిషి ఏ పని చెయ్యడానికీ  సంసిద్ధత కలిగి ఉండడు. మెదడు పరధ్యానాలతో నిండిపోయి ఉన్నప్పుడు దేనినీ లోతుగా గ్రహించలేదు సరికదా, దాని లోపల బలవంతంగా కూరిన ప్రతి విషయాన్నీ తిరస్కరిస్తుంది.

వివేకవంతుడు తనకు అందుబాటులో ఉన్న సమయాన్ని అనవసరమైన విషయాలపై కేంద్రీకరించి దుర్వినియోగం చేసుకోకుండా పూర్తిగా తన కోసం తాను  వినియోగించుకుంటాడు. తన వద్దనున్న సమయం విలువ తెలిసి మసులుకుంటాడు కాబట్టి దాన్ని మారకానికి పెట్టడానికి తగిన విలువైనదేదీ అతడికి ఎప్పటికీ దొరకదు. పబ్లిక్ కి తమ జీవితాల్లోకి చొరబడడానికి వీలుగా ఎవరైతే ఎల్లప్పుడూ దారులు తెరచి ఉంచుతారో వాళ్ళ దగ్గరుండే సమయం చాలా తక్కువ.

తన సమయాన్ని సద్వినియోగం చేసుకుని సంపూర్ణమైన జీవితం గడిపిన మనిషి జీవితం నుండి నువ్వేమీ తీసుకోలేవు. అతడి జీవితానికి నీకు చేతనైనంత కొత్తగా ఏదైనా కలపగలవు, అంత వరకే. నిజానికి కడుపునిండిన వాడికి నువ్వు పెట్టే పంచభక్ష్య పరమాన్నాలు అవసరం లేదు కానీ నీవిచ్చిన దాన్ని అతడు తప్పక గౌరవిస్తాడు. ఒక మనిషి తెల్ల జుట్టు, ముడుతలు చూసి ఎక్కువ కాలం జీవించాడని భ్రమపడరాదు. అతడు ఎక్కువ కాలం జీవించలేదు,అతడు ఎక్కువ కాలం ఈ భూమ్మీద ఉనికిలో ఉన్నాడు అంతే. 

మనుషులు ఏదైనా సహాయం చేసో, శ్రమను పెట్టుబడిగా పెట్టో పెన్షన్లూ,పారితోషికాలూ వంటివి ఆనందంగా పుచ్చుకుంటారు. కానీ వెనక్కు తిరిగిరాని విలువైన సమయాన్ని పెట్టుబడి పెట్టేటప్పుడు మాత్రం చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తారు. ఇటువంటి వ్యక్తులు మృత్యువు తలుపు తట్టినప్పుడు మాత్రం నరకంలో పెద్ద పెద్ద శిక్షలేవో పడతాయని భయపడి కనిపించిన దేవుణ్ణల్లా ప్రార్ధిస్తారు,తమను ఎలాగైనా బ్రతికించమని వైద్యులను ప్రాథేయపడతారు. తమ ప్రాణాల్ని కాపాడుకోడానికి ఎన్ని ప్రయత్నాలు చెయ్యాలో అన్నీ చేస్తారు.

నిజానికి జీవితాన్ని ఎల్లప్పుడూ తాత్విక దృష్టితో చూసేవాళ్ళు  మాత్రమే జీవితాన్ని వాస్తవంగా జీవిస్తారు. ఎందుకంటే వాళ్ళు తమ జీవితం పట్ల పూర్తి స్పృహతో ఉండడమే కాకుండా తత్వాన్ని చదవడం ద్వారా తమ ముందు తరాల తాత్వికతను కూడా తమ జీవితానికి అన్వయించుకుంటారు. 

"దైనందిన జీవితంలో ఒక్కోసారి ఎంతమాత్రం ప్రాముఖ్యత లేని విషయాలు నా విలువైన సమయాన్ని వృధా చేస్తున్నాయనిపించినప్పుడు అలసినపోయిన మృగం గుహలో తలదాచుకున్నట్టు నా జీవితాన్ని నాలుగ్గోడల మధ్య పరిమితం చేసి కొంతకాలం విరామం తీసుకుంటాను." అంటారు సెనెకా.

‘Let no one rob me of a single day who is not going to make me an adequate return for such a loss. Let my mind be fixed on itself, cultivate itself, have no external interest – nothing that seeks the approval of another; let it cherish the tranquillity that has no part in public or private concerns.’ But when my mind is excited by reading a convincing account of something and spurred on by noble examples, I long to rush into the forum, to speak on behalf of one man and offer help to another, which will at least be an attempt to assist even if it does not succeed, or to curb the pride of someone else grown arrogant by success.

ఈ పుస్తకంలో రచనలు చెయ్యడం,చదవడం వంటి వాటి పారమార్థికతను గుర్తు చేస్తారు సెనెకా. రాయడం అనగానే ప్రచురణ కోసమో, మార్కెటింగ్ కోసమో, అదీ కాకపోతే కీర్తినార్జించడం కోసమో కాకుండా ప్రప్రథమంగా తన కోసం రాసుకోవాలంటారాయన. చదవడం విషయంలో కూడా ఇదే నియమం వర్తిస్తుంది. కేవలం జ్ఞాన ప్రదర్శన కోసం కాకుండా తన మానసిక వికాసాన్ని పెంపొందించుకోడానికి చదవడాన్నీ,రాయడాన్నీ సాధకాలుగా చేసుకోవాలంటారు. ప్రపంచంకోసం చేసే రచన తన సారాంశాన్ని పదగాంభీర్యాల మధ్యా, భాషా సౌందర్యాల మధ్యా ఎక్కడో కోల్పోతుందనేది ఆయన భావన.

In my studies I suppose it must indeed be better to keep my theme firmly in view and speak to this, while allowing the theme to suggest my words and so dictate the course of an unstudied style of speech. ‘Where is the need,’ I ask, ‘to compose something to last for ages? Why not stop trying to prevent posterity being silent about you? You were born to die, and a silent funeral is less bothersome. So if you must fill your time, write something in a simple style for your own use and not for publication: less toil is needed if you study only for the day.’ Again, when my mind is lifted up by the greatness of its thoughts, it becomes ambitious for words and longs to match its higher inspiration with its language, and so produces a style that conforms to the impressiveness of the subject matter. Then it is that I forget my rule and principle of restraint, and I am carried too far aloft by a voice no longer my own.

పుస్తకం నుండి మరి కొన్ని వాక్యాలు :

Often a very old man has no other proof of his long life than his age.’

Even if others hold the front line and your lot has put you in the third rank, you must play the soldier there with your voice, your encouragement, your example and your spirit. Even if a man’s hands are cut off, he finds he can yet serve his side by standing firm and cheering them on. You should do something like that: if Fortune has removed you from a leading role in public life you should still stand firm and cheer others on, and if someone grips your throat, still stand firm and help though silent. The service of a good citizen is never useless: being heard and seen, he helps by his expression, a nod of his head, a stubborn silence, even his gait.

No man is despised by another unless he is first despised by himself. An abject and debased mind is susceptible to such insult; but if a man stirs himself to face the worst of disasters and defeats the evils which overwhelm others, then he wears those very sorrows like a sacred badge. For we are naturally disposed to admire more than anything else the man who shows fortitude in adversity.

Wednesday, August 11, 2021

Notes on Grief - Chimamanda Ngozi Adichie

కొన్నేళ్ళ క్రితం నైజీరియన్ అమెరికన్ రచయిత్రి చిమమంద న్గోజి అడిచే కథలు 'ది థింగ్ అరౌండ్ యువర్ నెక్' చదివాను,ఆ తరువాత మళ్ళీ ఆవిడ రచనలేవీ చదవలేదు. ఈ కోవిడ్ సమయంలో రాసిన 'నోట్స్ ఆన్ గ్రీఫ్' కనిపించగానే, చిరపరిచితమైన వ్యక్తి ఎవరో దారిలో ఎదురైనట్లు అనిపించింది. గుర్తుపట్టనట్లు తలప్రక్కకు తిప్పుకునో,తలొంచుకునో వెళ్ళిపోవడమో కంటే, ఒకసారి ఆగి యోగక్షేమాలడుగుతూ పలకరిస్తే పోతుందిగా అనిపించింది. అలా ఈ పుస్తకం చదవడం జరిగింది. శోకం అందమైన అనుభవం కాకపోయినా చాలా విలువైన అనుభవం. మన జీవితం కంటే మనం ప్రేమించినవారి మృత్యువు నేర్పించే జీవిత పాఠాలు వెలకట్టలేనివి. ఈ విషయంలో 'హాఫ్ ఆఫ్ ఎ ఎల్లో సన్' అనే పుస్తకంలో అడిచే రాసిన ఈ వాక్యాలు నాకెంతో అద్భుతంగా తోస్తాయి : “Grief was the celebration of love, those who could feel real grief were lucky to have loved.” 

Image Courtesy Google

'గ్రీఫ్' దీనికి సరైన తెలుగు పదం తట్టలేదు. శోకం,దుఖ్ఖము లాంటివి మనుషుల్ని కోల్పోవడాన్ని సూచించే ఖచ్చితమైన పదాలనిపించలేదు. ఈ రచనలో చిన్న చిన్న ఫ్రాగ్మెంట్స్ రూపంలో అడిచే తన తండి మరణం తాలూకూ శోకాన్ని గురించి రాశారు. గ్రీఫ్ ని ఒక్కొక్కరూ ఒక్కో విధంగా హేండిల్ చేస్తారు. కొందరు తనివితీరా బయటకి ఏడుస్తారు, కొందరు మనసులోనే బాధను దిగమింగుకుని మౌనాన్ని ఆశ్రయిస్తారు, కొందరు శోకాన్ని ఆగ్రహం రూపంలో వ్యక్తం చేస్తారు, కొందరు తమ బాధ్యతల్లో ఊపిరిసలపనంతగా మునిగిపోయి శోకాన్ని అధిగమించే ప్రయత్నం చేస్తారు, కొందరు 'ఫేక్ ఇట్ అన్టిల్ యూ మేక్ ఇట్' అనుకుంటూ నలుగురితో కలిసిపోయి నవ్వుతూ బాధను మర్చిపోయే ప్రయత్నం చేస్తారు. ప్రేమల్లో రకాలున్నట్లే శోకాన్ని వ్యక్తం చెయ్యడంలో కూడా చాలా రకాలుంటాయి. మనలా కళ్ళల్లోంచి ధారాపాతంగా కన్నీళ్ళు రావడడం లేదనీ, బయటకి ఏడుస్తూ రూఫ్ టాప్స్ మీదకెక్కి గగ్గోలుపెట్టడం లేదనీ మనిషికి శోకం లేదనుకోవడం మూర్ఖత్వం. అడిచే అంటారు, Grief is a cruel kind of education. You learn how ungentle mourning can be, how full of anger. You learn how glib condolences can feel. You learn how much grief is about language, the failure of language and the grasping for language. అందుకే ఎవరైనా మర్యాదపూర్వకంగా 'ఐ కెన్ అండర్స్టాండ్' అంటే నవ్వొస్తుంది. ఎందుకంటే 'నో,యూ డోంట్'.

కొందరు శోకాన్ని వ్యక్తపరచడానికి చాలా విచిత్రమైన మార్గాన్ని ఎన్నుకోవడం కూడా నాకు తెలుసు. అదేమిటో తెలుసా, వాళ్ళెప్పుడూ నవ్వుతూ ఉంటారు. ఆ నవ్వు వారి మానసిక బలానికి గుర్తు. విధిని సూటిగా కళ్ళల్లో కళ్ళుపెట్టి చూస్తూ 'నన్నేం చెయ్యగలవు నువ్వు? ' అని ప్రశ్నించే తిరస్కారం. జీవితం విలువ తెలిసి ఎప్పుడూ నవ్వుతూ ఉండేవాళ్ళని చూసి అసూయ పడేవారికి ఆ చిరునవ్వు వెనుక ఉండే బలమైన వ్యక్తిత్వం గురించి తెలిసే అవకాశం లేదు.
Another revelation: how much laughter is a part of grief. Laughter is tightly braided into our family argot, and now we laugh remembering my father, but somewhere in the background there is a haze of disbelief. The laughter trails off. The laughter becomes tears and becomes sadness and becomes rage. I am unprepared for my wretched, roaring rage. In the face of this inferno that is sorrow, I am callow and unformed. But how can it be that in the morning he is joking and talking, and at night he is gone forever?

ముఖ్యంగా తల్లినో, తండ్రినో కోల్పోవడం అంటే మన అస్తిత్వంలో కొంతభాగాన్ని కోసేసి తమతోపాటు తీసుకెళ్ళిపోయినట్లుగా ఉంటుంది. తండ్రిని కోల్పోయిన దుఖ్ఖములో I am yanked away from the world I have known since childhood. అంటారు అడిచే.

ఇక నైజీరియాలో కూడా వైధవ్యం విషయంలో భారతీయ సాంప్రదాయలను పోలిన ఆచారాలు  ఉంటాయని తెలిసి విచిత్రంగా అనిపించింది. భర్త మరణిస్తే గుండు చేయించుకోవడం, కొంతకాలం సరళమైన ఆహారం తీసుకోవడం లాంటివి ఇప్పుడు కూడా అమలులో ఉన్నాయట. కానీ అడిచే తల్లి వాటిని మూఢత్వంగా కొట్టిపారెయ్యకుండా తన భర్త గౌరవార్థం తనకు తానుగా పాటిస్తానంటారు.

My mother says that some widows have come to tell her what the custom is. First, the widow will be shaved bald – and before she can continue, my brothers promptly say that this is ridiculous and not going to happen. I say that nobody ever shaves men bald when their wives die; nobody ever makes men eat plain food for days; nobody expects the bodies of men to wear the imprint of their loss. But my mother says she wants to do it all: ‘I’ll do everything that is done. I’ll do it for Daddy.

ఈ రచనలో మృత్యువుని కవిత్వంగా మార్చిన వర్ణనలలాంటివి ఉంటానుకుంటే నిరాశే మిగులుతుంది. ఇది పుస్తకం పేరుకి తగ్గట్లే అడిచే తన తండ్రిని గురించిన జ్ఞాపకాలను నెమరువేసుకుంటూ రాసుకున్న సాధారణమైన జర్నల్ మాత్రమే. రచయిత్రిగా కట్టిపడేసే ఆమె శైలి నాకు పరిచయమే కాబట్టి ఈ రచనలో సృజనాత్మకతకూ,ఎస్తెటిక్స్ కు సూదూరమైన వివరాలు భాషకు అందని అడిచే శోకాన్ని పూర్తి వెలుగులో చూపించాయి అనిపించింది.

పుస్తకం నుండి మరికొన్ని అంశాలు :

All of us weeping and weeping and weeping, in different parts of the world, looking in disbelief at the father we adore now lying still on a hospital bed.

My breathing is difficult. Is this what shock means, that the air turns to glue?

Needle-pricks of resentment flood through me at the thought of people who are more than eighty-eight years old, older than my father and alive and well. My anger scares me, my fear scares me, and somewhere in there is shame, too – why am I so enraged and so scared?

I wince now at the words I said in the past to grieving friends. ‘Find peace in your memories,’ I used to say. To have love snatched from you, especially unexpectedly, and then to be told to turn to memories. Rather than succour, my memories bring eloquent stabs of pain that say, ‘This is what you will never again have.’ Sometimes they bring laughter, but laughter like glowing coals that soon burst aflame in pain. I hope that it is a question of time – that it is just too soon, too terribly soon, to expect memories to serve only as salve.

Sunday, August 8, 2021

The Allegory of the Cave - Plato (Benjamin Jowett)

ఎలిజబెత్ గాస్కెల్ 'నార్త్ అండ్ సౌత్' బీబీసీ అడాప్టేషన్ చూసి ఒక దశాబ్దం పైనే అయినట్లుంది. అందులో మిల్టన్ లో కాటన్ మిల్ యజమాని జాన్ థ్రోన్టన్ కి చిన్నప్పుడే తండ్రి మరణం కారణంగా  కుటుంబం,మిల్లు బాధ్యతలు మీద పడడంతో చదువుకు ఎక్కువ సమయం కేటాయించలేకపోతాడు. ఆ ఊరికి కొత్తగా వచ్చిన మార్గరెట్ హేల్ తండ్రితో థ్రోన్టన్ కు స్నేహం కుదరడంతో ఆయన దగ్గర రోజూ కొంత సేపు ట్యూషన్ చెప్పించుకుందామని నిర్ణయించుకుంటాడు. అప్పుడు హేల్ తండ్రి, "జాన్ కి చదువు అరిస్టాటిల్ తో మొదలు పెట్టాలా లేదా ప్లేటో తో మొదలుపెట్టాలా అని ఆలోచిస్తున్నాను" అంటాడు. అది చూసినప్పుడు అనిపించింది,ఒకప్పటి చదువు వాస్తవ జీవితంలో సంక్లిష్టతలను సమర్థవంతంగా ఎదుర్కునే క్రమంలో వివేకాన్ని పెంపొందించేదిగా ఉండేది. పూర్తిగా కాకపోయినా అటువంటి చదువుకు ఉండే ప్రాముఖ్యతను గుర్తెరిగిన సమాజం అది. మరి ఇప్పుడు, లెక్కలూ,అంకెలూ,నిర్వచనాలూ అంటూ అంతా 'ఫాక్ట్ బేస్డ్' చదువైపోయింది. నేడు సాంకేతిక విద్యకు ఇస్తున్న ప్రాముఖ్యత మానవీయ విలువలు పెంపొందించే విద్యకు లేదు. దానితో 'మైండ్ అండ్ సౌల్' విషయంలో సంతులనం లోపించి మనిషి అపరిమిత జ్ఞానసంపన్నుడైనప్పటికీ వివేకహీనుడుగా మిగిలిపోతున్నాడు. ఫలితం, నేటి విచక్షణారహిత సమాజం మన కళ్ళముందు స్పష్టంగా కనిపిస్తోంది. జ్ఞాపకశక్తిని తెలివితేటలకూ,తెలివితేటల్ని వివేకానికీ ముడిపెట్టి మురిసిపోతున్న అమాయకపు తరం మనది. ఒకానొకప్పుడు ఏథెన్సులో ఇటువంటి వాస్తవాలను గొంతెత్తి చెప్పిన నేరానికి సోక్రటీస్ కు మరణదండన విధించారు. ఇంత దూరం ప్రయాణించి వచ్చినా మునుపటి తరానికీ,నేటి తరానికీ ఈ విషయంలో పెద్ద తేడా లేకపోవడం దురదృష్టకరం. 

Image Courtesy Google

మొత్తం పది పుస్తకాల ప్లేటో 'రిపబ్లిక్' లో ఏడవ పుస్తకంలో ప్లేటో అన్నగారైన గ్లాకన్ కూ, సోక్రటీస్ కూ నడుమ జరిగిన సంభాషణల్లో భాగంగా 'The Allegory of the Cave' గా ప్రసిద్ధికెక్కిన ఒక చిన్న కథను  చెప్తారు సోక్రటీస్. ఇది చదివినప్పుడు రోలాండ్ బార్త్, గై డెబోర్డ్, వాల్టర్ బెంజమిన్, బెర్ట్రాండ్ రస్సెల్, కలాస్సో వంటి తత్వవేత్తలు తరువాత కాలంలో చేసిన అనేక ప్రతిపాదనలకు మూలాలు ఈ కథలోనే  ఉన్నాయనిపించింది. నేను వీరి ప్రతిపాదనలను ఇదివరకే కొంత చదివి ఉండడంతో ఈ పిట్టకథ 375 బీసీ నాటిదని తెలిసి మరింత ఆశ్చర్యమనిపించింది.

సోక్రటీసు గ్లాకన్ కు చెప్పిన కథ ఇది : అనగనగా ఒక గుహ,ఆ గుహలో నుండి కాస్త పైకి వెళ్తే బయట ప్రపంచానికి ఉన్న ఒకే ఒక ద్వారం..ఆ గుహలో తల తిప్పి వెనక్కి చూడడానికి కూడా వీలులేకుండా మెడకూ,కాళ్ళకూ సంకెళ్ళతో చిన్నప్పటినుండీ ఖైదు చెయ్యబడ్డ కొందరు మనుషులు. వాళ్ళకి వెనుక భాగంలో కాస్త దూరంగా ఎప్పుడూ వెలుగుతూ ఉండే మంట..ఆ మంటనుండి వచ్చే వెలుగు కారణంగా వీళ్ళ ఎదురుగా ఉన్న గోడమీద వీళ్ళ దృష్టికి ఆవల ఉండే ప్రపంచం తాలూకు ప్రతిబింబాలు కనిపిస్తూ ఉంటాయి.ఒక్కోసారి ఈ గుహలో ప్రతిధ్వనించే శబ్దాలను ఆ ప్రతిబింబాలే స్వయంగా మాట్లాడుతున్నాయనుకుని భ్రమపడే అవకాశం కూడా ఉంది.

To them, I said, the truth would be literally nothing but the shadows of the images.

Image Courtesy Google

 ఇప్పుడు సూర్యకాంతినీ, చీకటినీ, ప్రతిబింబాలనీ   మెటఫోర్లుగా వాడుతూ సోక్రటీస్ చెప్పిన కథలోని    సారాంశాన్ని చూద్దాం : 

 * ఒకవేళ వారిలో ఒక ఖైదీ  విడుదలైన   పక్షంలో అతడు ఉన్నట్లుండి తన చీకటి గుహలో   అలవాటైన నీడల బదులు వెలుగులు   చిమ్మే సూర్య కాంతిని చూడలేక   సతమతమవుతాడు.

 * చీకటి బదులు వెలుతురునూ, ప్రతిబింబాల   బదులు వాస్తవాన్నీ చూడగలగడానికి   అతడు చాలా  కష్టపడతాడు. తన కళ్ళకి సౌకర్యవంతంగా ఉండే అలవాటైన నీడలే నిజమేమో అనుకుంటాడు.

 * ఇప్పుడు వెలుగులో గుహ వెలుపలి ప్రపంచంలో అతడు చూసే వస్తువులను పేర్లతో సహా చెప్పి గుర్తుపట్టమని ఎవరైనా అంటే అతడు గందరగోళానికి గురవుతాడు. ఎందుకంటే ప్రతిబింబాలకు అతడు పెట్టుకున్న పేర్లు వేరు. అతడికి సంబంధించినంత వరకూ గుహలో అతడి చీకటి జీవితం వాస్తవం. మిగతాదంతా భ్రమ.

* మొదట్లో వెలుతురును సూటిగా చూసే ప్రయత్నం చేస్తే కళ్ళు నెప్పెట్టి, చూపు తిప్పుకుంటాడు. తన కళ్ళు గ్రహించగలిగిన కాంతిని మాత్రమే చూసే ప్రయత్నం చేస్తాడు. కానీ కాస్త దగ్గరగా మనుషుల్నీ,జంతువుల్నీ చూశాకా అతడు తాను ఇంత కాలం చూసిన నీడలన్నీ భ్రమలని చివరకు అర్ధం చేసుకుంటాడు. శబ్దాలకు ఆధారభూతమైన మూలాలను గ్రహిస్తాడు.

* ఇప్పుడు తాను చూసిన అద్భుతమైన వాస్తవాలను తన సహచరులతో పంచుకోడానికి గుహలోపలికి పరిగెత్తుకుంటూ వెళతాడు. (ఇప్పుడు ఇతడు సత్యాన్ని గ్రహించిన జ్ఞానీ,తాత్వికుడూ.) 

* కానీ లోపల మనుషులకు ఇవేవీ తెలియదు. వాళ్ళకి ఇప్పటికీ ఆ చీకటి గుహలో నీడలే నిజం. లోపల కనిపిస్తుందంతా భ్రమని వారికి చెప్పజూస్తే ఈ తాత్వికుణ్ణి పిచ్చివాడు అనుకుంటారు.

* బయట తమకు తెలీని వెలుగులోకి వెళ్ళగానే కళ్ళు బైర్లుకమ్మి మతితప్పి  వ్యవహరిస్తున్నాడని అతన్ని హేళనచేసి తరిమికొడతారు.

* ఇప్పుడు ఆ గుహలో వ్యక్తులు మునుపటిలాగే నీడల్ని గమనిస్తూ ఏ నీడ ముందో,ఏ నీడ తరువాతో అని వారిలో వారు పెట్టుకునే పోటీలు ఈ తాత్వికుణ్ణి మునుపటిలా ఆకర్షించలేవు. అతడు వారి పోటీల్లో పాలుపంచుకోడానికి ఆసక్తి చూపడు. వారి మూర్ఖత్వంతో కూడిన గౌరవాలనూ, విజేత పురస్కారాలనూ అతడు లెక్క చెయ్యడు, ఆ పోటీల్లో విజేతలను చూసి ఈర్ష్య చెందడు. వాళ్ళ చీకటి ప్రపంచం,దాని విధివిధానాలన్నీ అతడికి అఙ్ఞానంగా తోస్తాయి. కానీ వాళ్ళు మెజారిటీ.

Would he not say with Homer, ‘Better to be the poor servant of a poor master,’ and to endure anything, rather than think as they do and live after their manner?

ఈ పిట్ట కథను ఏ తరానికి అన్వయించినా సరిగ్గా అతికిపోతుంది. వాస్తవ జీవితాలు సోషల్ మీడియా కిటికీల్లో ప్రతిబింబాలుగా రూపాంతరం చెందిన ఈ కోవిడ్ పాండెమిక్ సమయంలో ఈ కథ మరింత ప్రాముఖ్యతను సంతరించుకుంది అనిపిస్తుంది. శాస్త్ర సాంకేతికాభివృద్ధి వలన మన అస్తిత్వాలు 'ప్లేటో కేవ్' లోని గోడ మీద నీడల్లా పరిణామం చెందిన క్రమంలో నీడల్ని నిజమనుకుని,ప్రతిధ్వనుల్ని నీడల వెనుక స్వరాలని అనుకుంటూ వాస్తవమేదో భ్రమేదో తెలుసుకోలేని అజ్ఞానంలో కొట్టుమిట్టాడుతున్న ఖైదీలం మనం. ఎవరైనా మెజారిటీ మూర్ఖత్వాన్ని ఎద్దేవా చేస్తూ 'వెలుగు' ను చూపించే ప్రయత్నం చేసినా వాళ్ళని సోక్రటీస్ లా పిచ్చివాడనీ,ప్రమాదకారి అనీ ముద్రవేసే సమాజంలోనే ఇప్పటికీ ఉన్నాం. 

ఒక తత్వవేత్త సాధారణ సమూహానికి తనకు తెలిసిన జ్ఞానాన్ని పంచడానికి ప్రయత్నిస్తే ఎలా ఉంటుందో ఈ కథ ద్వారా వివరించే ప్రయత్నం చేశారు సోక్రటీస్. జ్ఞానం అందుబాటులో ఉన్నా దాన్ని గ్రహించే విషయంలో మనిషిలో మానసిక సంసిద్ధత లేకపోతే వాస్తవం కళ్ళముందే కనిపిస్తున్నా ఎప్పటికీ అజ్ఞానాంధకారంలోనే మిగిలిపోతాడు. మనిషిలో జ్ఞానాన్ని అతడు ఉండే పరిసరాలూ, అతడు కలిసిమెలిసి తిరిగే సమూహాలూ ఎంతగా ప్రభావితం చేస్తాయో చెప్పడానికి కూడా ఈ కథ ఒక చక్కని ఉదాహరణ. ఈ పుస్తకానికి అనేక అనువాదాలున్నప్పటికీ బెంజమిన్ జోవెట్ అనువాదం దొరికితే తప్పకుండా చదవండి.

పుస్తకం నుండి మరికొన్ని నచ్చిన వాక్యాలు : 

But then, if I am right, certain professors of education must be wrong when they say that they can put a knowledge into the soul which was not there before, like sight into blind eyes.  

And whereas the other so-called virtues of the soul seem to be akin to bodily qualities, for even when they are not originally innate they can be implanted later by habit and exercise, the virtue of wisdom more than anything else contains a divine element which always remains, and by this conversion is rendered useful and profitable; or, on the other hand, hurtful and useless. Did you never observe the narrow intelligence flashing from the keen eye of a clever rogue—how eager he is, how clearly his paltry soul sees the way to his end; he is the reverse of blind, but his keen eyesight is forced into the service of evil, and he is mischievous in proportion to his cleverness

The students of the art are filled with lawlessness.

So men who begin to analyse the first principles of morality cease to respect them.

Young men are fond of pulling truth to pieces and thus bring disgrace upon themselves and upon philosophy.

The study of philosophy to continue for five years; 30-35

Thursday, August 5, 2021

The Terror of Fables - Roberto Calasso

ఆస్ట్రియన్ రచయిత రాబర్ట్ ముసిల్ మాగ్నమ్ ఓపస్ 'ది మాన్ వితౌట్ క్వాలిటీస్' లో కథానాయకుడు అల్రిచ్ స్పోర్ట్స్ మాగజైన్లో ప్రచురించిన ఒక వ్యాసంలోని వాక్యం 'a racehorse of genius' చదివి ఆలోచనలో పడతాడు..ఆ సందర్భంలో అల్రిచ్ కి ప్రపంచ చరిత్ర యావత్తూ ఈ వాక్యంతోనే ముడిపడి ఉన్నట్లు తోస్తుంది..వెనువెంటనే అతడు ఒక మాథెమెటీషియన్ గా తన జీవితం నుండి ఒక సంవత్సరం పాటు శెలవు తీసుకుని 'ఎ మాన్ వితౌట్ క్వాలిటీస్' గా రూపాంతరం చెందుతాడు..ఈ కథ విన్నప్పుడు తరతరాలనుండి వస్తున్న సంస్కృతీ సంప్రదాయాలూ,రాజకీయ సామజిక స్థితిగతులూ,సాంఘిక నియమాలూ,వ్యవస్థలూ మనకు ఆపాదించిన అస్తిత్వపు చిహ్నాలను సమూలంగా చెరిపేసి అల్రిచ్ లా శెలవు తీసుకోవడం మనకు కుదిరే పనేనా అనిపిస్తుంది..గత సంవత్సరం చదివిన ఒట్టెస్సా మోష్ఫెగ్ రచన 'మై ఇయర్ ఆఫ్ రెస్ట్ అండ్ రిలాక్సేషన్' లో కూడా యధాతథంగా కాకపోయినా దాదాపూ ఇటువంటి అంశమే చర్చకు వస్తుంది..అందులో యువ కథానాయిక జీవితపు నైరాశ్యం నుండి బయటపడడానికి ఒక సంవత్సరంపాటు ఒంటరిగా తన అపార్ట్మెంట్లో సైకియాట్రిస్ట్ ఇచ్చిన మందులు వాడుతూ నిద్రాణస్థితిలో జీవించాలని నిర్ణయించుకుంటుంది..రాబర్ట్ ముసిల్ కథానాయకుడు సంఘజీవిగా తన అస్తిత్వాన్ని వదిలించుకునే ప్రయత్నం చేస్తే ,మోష్ఫెగ్ కథానాయిక ఒంటరితనంతో అలసిపోయి డిప్రెషన్ బారిన పడుతున్న నేటి తరానికి ప్రతినిధిలా కనిపిస్తుంది..ఏదేమైనా ఈ రెండు కథల్లోనూ అలసిపోయి అస్తిత్వపు మూలలను వదిలించుకోవాలనే తపన మాత్రం సుస్పష్టం..సాంస్కృతిక మూలాలను రక్షించుకోవడం పేరిటో లేదా సౌకర్యవంతమైన మార్గమనుకునో అనుకరణ,అనుసరణలను విధిగా పాటిస్తూ జీవించేవారు కొందరైతే,Be a Roman in Rome తరహాలో తమ చుట్టూ ఉన్న పరిసరాలకూ,మనుషులకూ,వ్యవస్థలకూ అనుగుణంగా తమ ఉనికిని నిరంతరం మార్చుకుంటూ స్పష్టమైన అస్తిత్వాన్ని తిరస్కరించిన వాళ్ళు కొందరు..కానీ ప్రాక్టికల్ గా అస్తిత్వాన్ని పూర్తిగా చెరిపేసుకోవడం మన చేతుల్లో ఉండే పనేనా ?

Image Courtesy Google

ప్రాచీనకాలం నుండీ ఒక తరం నుండి మరో తరానికి సంస్కృతీ,సంప్రదాయాల పేరిట పూర్వపు నియమాలు,చరిత్ర,నాగరికత లాంటివి అందించబడతాయి..ముఖ్యంగా సాహిత్యంలో కథలూ,కవిత్వం లాంటివి ఈ కొనసాగింపుకి కీలక మాధ్యమాలుగా వర్తిస్తాయి..సాహితీ  ప్రపంచంలో 'మిత్' (పురాణం/గాథ) చాలా ప్రత్యేకమైనది..ఈ 'మిత్' ను వాడుక భాషలో పుక్కిట పురాణమని కూడా అంటుంటాం..'మిత్' చరిత్రను సజీవంగా ఉంచుతుంది..ఆ నోటా ఈ నోటా వినే పిట్టకథల ద్వారానో, బుఱ్ఱకథలు, తోలుబొమ్మలాటలూ, సాహిత్యం,చిత్రలేఖనం ,నాట్యం వంటి వివిధ కళారూపాల ద్వారానో ,ఇతరత్రా చిహ్నాల ద్వారానో ఒక తరం నుండి మరో తరానికీ, ఒక వ్యవస్థ నుండి మరో వ్యవస్థలోకీ జొరబడే ఈ పురాణాలు మనిషికి గతించిన కాలపు సంస్కృతిని పరిచయం చేస్తాయి..పాలిటిక్స్,జర్నలిజం వంటి రంగాలలో విస్తృతమైన అధ్యయనాలు చేసిన రోలాండ్ బార్త్ , తన 'మైథాలజీస్' లో 'మిత్' గురించి రాస్తూ ఏ సంస్కృతికి సంబంధించిన పురాణమైనా 'సైన్ ని సిగ్నిఫైర్ గా మార్చే సెమియోటిక్  సిస్టం లో భాగమని' అంటారు..వివిధ సంస్కృతులకు సంబంధించిన చరిత్ర యావత్తూ ఈ మిత్ ప్రాతిపదికగా రూపొందినదే..మిత్స్ సమాజాన్ని ప్రత్యక్షంగానూ పరోక్షంగానూ కూడా శాసిస్తాయి.

ఇటాలియన్ రచయిత రోబర్టో కలాస్సో 'ది ఫోర్టీ నైన్ స్టెప్స్' అనే పుస్తకంలో 'ది టెర్రర్ ఆఫ్ ఫేబుల్స్' పేరిట రాసిన వ్యాసంలో మిత్ కు కొన్ని పేజీలు కేటాయిస్తూ పురాణాల వల్ల మనిషికి కలిగే లాభనష్టాలను బేరీజు వేసే ప్రయత్నం చేశారు..చరిత్ర మనకు మార్గం సులభం చేస్తుందా లేక మోయలేక వదిలించుకోవాలనుకునే గుదిబండగా మిగులుతుందా అనే దిశగా ఆలోచనలు రేకెత్తిస్తూ ఇందులో పలు విశ్లేషణలు ఉన్నాయి..కథలూ,గాథలూ మేలు చెయ్యడం గురించి తెలుసు గానీ కీడు చెయ్యడం ఏమిటని ఆశ్చర్యంగా అనిపించినా, కలాస్సో తన పదునైన వాదనతో పాఠకుల్ని ఆలోచనలో పడేస్తారు..ఈ మిత్ ను రెండు అర్ధాల్లో తీసుకోవచ్చు అంటారు కలాస్సో : మొదటిది, 'ప్రశ్నించడానికి అవకాశం లేని అద్భుతం' అయితే రెండోది దానికి పూర్తిగా భిన్నమైన అర్థంలో 'ఒక అబద్ధం / భ్రమ / పుక్కిటి పురాణమని' కొట్టిపారేసేది..మిత్ గురించి చర్చించే నేపథ్యంలో ప్లేటో 'రిపబ్లిక్' ను ఉదహరిస్తూ గ్రీకు పురాణాల్లో తరచూ వివాదాస్పదమైన అంశంగా నిలిచిన ఈ మిత్ కు పూర్తి స్థాయి సాధికార స్వరంలో వ్యతిరేకత ఎదురైంది మాత్రం ప్లేటో 'రిపబ్లిక్' లోనే అంటారు..ప్లేటో 'రిపబ్లిక్' లో తాత్వికతకూ,కవిత్వానికీ పూర్వపు వైరాన్ని వెలికి తీస్తారు..ఆనాటికి కవిత్వానికి మారు పేరేదైనా ఉందంటే అది ప్రాచీన గ్రీకు సాహిత్యానికి పునాదులు వేసి,ఇలియడ్,ఒడిస్సీలను సృష్టించిన హోమర్ మాత్రమే..ఆ కోణంలో చూస్తే మొత్తం రిపబ్లిక్ ను ప్లేటో, హోమర్ ల మధ్య ఘర్షణగా పరిగణించవచ్చు..గ్రీకులు హోమర్ ను తమ తొలి ఆధ్యాత్మిక గురువుగా , ప్రపంచానికీ , దేవుళ్ళకీ మధ్య తన కవిత్వాన్ని వారధిగా చేసిన అనుసంధానకర్తగా చూస్తారు..అటువంటి హోమర్ ని ప్లేటో , 'రిపబ్లిక్' రెండవ పుస్తకంలో కవిత్వం పేరిట కట్టుకథలల్లి పుక్కిట పురాణాలు సృష్టించిన వ్యక్తి అంటూ అధిక్షేపిస్తారు..ఇక రిపబ్లిక్ పదవ పుస్తకం దగ్గరకు వచ్చేసరికి కవులను 'మిమెసిస్' (the dangerous art of imitation) సాధన చేసే వ్యక్తులుగా నిందిస్తారు..కవులు లేనిదాన్ని ఉన్నట్లు భ్రమింపజేస్తూ తాము ప్రాతినిథ్యం వహించే కళకు న్యాయం చెయ్యడంలో విఫలమయ్యారని అంటారు ప్లేటో. 

హోమర్ కు వ్యతిరేకంగా ప్లేటో వాదనలన్నీ కేవలం ఒక ఆదర్శవాది చేసిన అభియోగాలనుకుంటే పొరపాటే..నిజానికి ప్లేటో ఆరోపణలన్నీ పూర్తి స్థాయి మెటాఫిజికల్ దృష్టికోణం నుండి చేసినవేనంటారు కలాస్సో..ఒక వేళ హోమర్ సృష్టించిన దేవుళ్ళను నమ్మాల్సిన పక్షంలో, నిరంతరం తమ రూపాలను మార్చుకుని మానవుల్ని మోసం చేసే దేవుళ్ళను ఇంద్రజాలికులుగా , మాంత్రికులుగా, గారడీలు చేసే వ్యక్తులుగా భావించవలసివస్తుంది..కానీ నిజానికి దైవత్వాన్ని తన కవిత్వంలో పునః సృష్టించే క్రమంలో హోమర్ సైతం దేవుళ్ళు నిరంతరం రూపాంతరం చెందే ప్రక్రియకు ప్రత్యక్ష సాక్షి కాదు..హోమర్ ఆ మెటామార్ఫోసిస్ కు పరోక్షంగా ప్రాతినిథ్యం వహించే సాధనంగా మాత్రమే అగుపిస్తారు..ఈ కారణంగా ఏ విధమైన స్పష్టతా,నియంత్రణా లేని ఈ మెటాఫిజికల్ జోన్ సహజంగానే ఫిలాసఫర్లకు శత్రు సమానంగా కనిపిస్తుంది..అందువల్ల వాస్తవికతకు సుదూరంగా అబ్సర్డిటీ తో కూడిన ఈ ప్రాంతానికి ప్రాతినిథ్యం వహించే కవులు ప్రజా శ్రేయస్సు దృష్ట్యా సంఘం నుండి బహిష్కరింపబడాలన్నది ప్లేటో వాదన.

నిశితంగా గమనిస్తే ఆంగ్లో సాక్సన్ల క్రిస్టియానిటీకీ, వైకింగ్స్ పాగనిజానికీ మధ్య ఉన్న విగ్రహారాధనకు సంబంధించిన వైరం లాంటిదే ప్లేటో హోమర్ ల మధ్య 'సిములాక్రం' లో (Simulacrum = వాస్తవానికి ప్రతిరూపం/అనుకరణ/ప్రాతినిథ్యం వహించేది) కూడా కనిపిస్తుంది..'సిములాక్రం' మనిషిని తనను అనుసరించమని శాసిస్తుంది,దానిని చూసిన మనిషి తన ప్రమేయం లేకుండానే దాని ప్రతిరూపంగా మారిపోతాడు..ఒకవేళ ప్లేటో రిపబ్లిక్ లో భావించినట్లు సిములాక్రం వాస్తవదూరంగా,లోపభూయిష్టంగా ఉన్న పక్షంలో దానికి రూపకల్పన చేసిన కవి కూడా తాను సృష్టించిన దేవుడిలాగే ఇంద్రజాలికుడిలా,తాంత్రికుడిలా మారిపోతాడు..అందువల్ల దైవమైనా,ఆ దైవాన్ని సృష్టించిన కవి అయినా 'సిములాక్రం' అన్న పదంలో కంటికి కనిపించని శత్రువుల్లా దాగి ఉన్నారన్నది ప్లేటో భావన..దీనినే మరో విధంగా చూస్తే , 'మిత్' అనేది ఒక అవాస్తవికతను మరో అవాస్తవికతగా చూపించే ప్రయత్నం చేస్తుంది..ప్లేటో ఈ అవాస్తవికతను వ్యతిరేకిస్తారు. 

ఈ తరహా హోమరిక్ మిత్ నూ, వాళ్ళ 'మిమెటిక్' పోయెట్రీ నీ ఖండించిన 'ప్లేటో ప్రపంచం'లో కేవలం కవికే గాక అతడు సృష్టించిన దేవుళ్ళకు కూడా స్థానం లేదు..ప్లేటో కవిని "A man skillfully able to transform himself into everything" అని నిర్వచిస్తారు..కవిత్వం విషయంలో సిములాక్రా , అనగా కొన్ని ప్రత్యేకమైన లేదా మెటాఫోరిక్ పదాల వాడకం పట్ల ప్లేటో కి ఉన్న ఖచ్చితమైన అభ్యంతరాలవల్ల పెద్ద నష్టం లేకపోయినప్పటికీ , కావ్యసృష్టిలో  భాగమైన మెటామోర్ఫోసిస్ ను తిరస్కరించడం వల్ల మాత్రం రెండు ప్రమాదాలుంటాయంటారు కలాస్సో..మెటామోర్ఫోసిస్ ను తిరస్కరించడంతో 'A is transformed into B' అనే బదులు 'A is B' అని వాడవలసిన పరిస్థితి ఎదురవుతుంది..మొదటిది (మెటామోర్ఫోసిస్) ఖచ్చితంగా వృత్తాంతపరమైనది కాబట్టి అంటే నేరేటివ్ కి అవకాశమున్న అంశం కాబట్టి ఏ ఇమేజ్ అయినా రూపాంతరం చెందే క్రమంలో జ్ఞానసముపార్జనకు ఆస్కారం ఉంటుంది, ఎందుకంటే ఎంతో కొంత జ్ఞానం ప్రసాదించని సంస్కృతీ,నాగరికతా అంటూ ఉండే అవకాశం లేదు గనుక..దీనికి భిన్నంగా, రెండో పద్ధతి 'A is B' నేటి సాంకేతిక రంగంలోని అల్గోరిథంలా ఇన్పుట్,ఔట్పుట్ పద్ధతిలో ఉండడం వల్ల మెటామోర్ఫోసిస్ కు అవకాశం శూన్యం..అందుచేత ప్లేటో మెటామోర్ఫోసిస్ ని తిరస్కరించడం అంటే,కవి భావోద్వేగాల వల్ల ప్రభావితమయ్యే ఊహాత్మకతనూ,తద్వారా ఇమేజ్ ని అర్థంచేసుకునే (cognitive power ) ప్రయత్నంలో జనించే అపరిమితమైన జ్ఞానాన్ని తిరస్కరిస్తున్నట్లే లెక్క.

ప్లేటో వాదనలో ఉన్న లొసుగులు చూశాం కాబట్టి,ఇప్పుడు ఆయన చెబుతున్న ఇమిటేషన్ లో ఉన్న ప్రమాదాలేమిటో కూడా చూద్దాం..పురాణాలు మనుషుల్ని తమను అనుకరించేలా మాయ చేస్తాయి,తమ సైద్ధాంతిక ప్రతి రూపాలుగా తయారుచేస్తాయి..ఈ మాయలో పడ్డవాళ్ళు కర్ట్ వన్నెగట్ సృష్టించిన Karass (A network or group of people who are somehow affiliated or linked spiritually ) లాంటివాళ్ళు..గుడ్డి అనుకరణ మినహా తామేం చేస్తున్నారో కనీస స్పృహ లేని వీళ్ళు తమను తాము ఆ సిములాక్రాలో భాగంగా అంగీకరిస్తారు.

ఇక మిత్ ను గురించి సోక్రటీస్ నిర్వచనం ప్లేటో ప్రతిపాదనకు కి పూర్తి విరుద్ధంగా ఉంటుంది..ఈ విషయంలో ప్లేటో లో ఉన్న మొండితనం సోక్రటీస్ లో కనిపించదు..సోక్రటీస్ మిత్ గురించి మాట్లాడుతూ “Beautiful indeed is this risk, and we somehow need to be enchanted with these things [i.e., with the fables themselves].” అంటారు..ఈ సందిగ్ధంలో రాబర్ట్ ఫ్రాస్ట్ కవితలో చెప్పిన రెండు మార్గాలూ గుర్తొచ్చాయి..ప్లేటో హెచ్చరించిన అస్పష్టత,అనుకరణలతో కూడిన దారిలో ప్రయాణించడమా లేదా గుడ్డి అనుసరణకు అవకాశమివ్వకుండా తర్కాన్ని నమ్మి స్పష్టతతో కూడిన సౌకర్యవంతమైన దారిలో ప్రయాణించడమా అనేది ఇక్కడ ఎవరికి వారు చేసుకోవాల్సిన నిర్ణయం.

ఈ మిత్ ప్రభావాన్ని మనకు అర్ధమయ్యేలా చెప్పడానికి ఒక ఆసక్తికరమైన గ్రీక్ మిత్ ను ఉదహరిస్తారు కలాస్సో : మిత్ మనమీద చెక్కతో చేసిన టారియన్ ఆర్టెమిస్ విగ్రహంలా పనిచేస్తుందంటారాయన..ఓరెస్టిస్ దాన్ని ఆలయంలోనుండి దొంగిలించి చేతుల్లో గట్టిగా పొదువుకుని పారిపోతున్నంతసేపూ  అతడిలో ఒకవిధమైన ఉన్మాదం జనిస్తుంది..చాలా దూరం పరిగెత్తి అలసిపోయిన ఓరెస్టిస్ ఒకరోజు హఠాత్తుగా ఆ విగ్రహాన్ని వదిలించుకోవాలని నిశ్చయించుకుని యూరోటస్ నదికి సమీపంలో ఒక చిట్టడివిలోని  పొదల్లో దాచేసి వెళ్ళిపోతాడు..ఆ విగ్రహం అక్కడే ఏళ్ళ తరబడి ఎవరికంటాబడకుండా శిథిలమైపోతుంది..ఒకరోజు ఆ మార్గం గుండా ప్రయాణిస్తున్న ఇద్దరు స్పార్టన్ యువకులు ఆస్ట్రాబాకస్,ఏలోపెకస్ లు యాదృచ్చికంగా ఆ విగ్రహం చూడడం జరుగుతుంది..తీక్షణంగా తమకేసి చూస్తున్న ఆ విగ్రహాన్ని చూసి తామేం చూస్తున్నారో గ్రహించలేని స్థితిలో వాళ్ళిద్దరూ పిచ్చివాళ్ళవుతారు..సిములాక్రం కి ఉన్న శక్తి కూడా ఇటువంటిదే అంటారు కలాస్సో..దాని గురించి అర్థం చేసుకోగలిగిన వారిని మాత్రమే అది నయం చేస్తుంది..మిగతావారికి అది ఒక విరుగుడు కాని వ్యాథిలా సంక్రమిస్తుంది..

Thus the myth: The power that arouses terror is also the only one that can cure it, as happened with Orestes. But only if it is recognized for what it is.

తొలి ప్రచురణ ఆంధ్ర జ్యోతి వివిధ : 2 ఆగష్టు 2021

https://lit.andhrajyothy.com/vividha/poet-pleto-37634

https://www.andhrajyothy.com/telugunews/what-did-plato-have-to-do-with-poets-19210802042167?fbclid=IwAR0hR2M9kZvzyIyZ9yJrYkH-Klr53Vz_oy-OYh6GhMF2lTSYdjfh7bELCE4

Monday, August 2, 2021

Hyderabad Book Trust Article

చిన్నప్పటి నుండీ ఏకాంతం నా ప్రియ నేస్తం..నీళ్ళలోంచి బయటకు తీసిపడేసిన చేప పిల్ల చందంగా ఆటవిడుపుగా బాహ్య ప్రపంచంలోకి వచ్చినా నా అంతః ప్రపంచాన్ని దాటి ఆవలవైపు ఆట్టే సేపు ఉండలేను. నిర్ణీత సమయం దాటితే శ్వాస ఆడనట్లు సతమతమవుతాను. నేను ప్రత్యేకం కాదు, నాలాంటి అంతర్ముఖులు నా చుట్టూ కోకొల్లలు. ఎప్పుడైనా జ్ఞాపకాల తెరలు తీసి చూద్దును కదా, నలుగురి మధ్యలో నన్నెంత వెతుక్కున్నా నాకు 'నేను' కనపడలేదు. సమూహాల్లో మసిలేటప్పుడు ఇతరుల స్వాభావికమైన నీడలు పడని స్వచ్ఛమైన ఉనికి జాడలు పట్టుకోవడం ఒకింత కష్టం కదూ ! వెనక్కి తిరిగి చూసుకుంటే నా అపురూపమైన జ్ఞాపకాలన్నీ ఏకాంతంతో ముడిపడిన క్షణాలే. అందులోనూ ఏకాంతానికి కాస్త వర్షం జతగా వస్తే ఆ అనుభవం విలువ అమాంతం పెరిగిపోతుంది. వర్షపు రోజుల్లో స్కూలుకి మధ్యాహ్నం అనుకోకుండా సెలవొస్తే పండగలా ఉండేది. కిషోర్ సోలోస్ వింటూ, కిటికీ ప్రక్కన ఫేము కుర్చీలో కూర్చుని బొమ్మలకి రంగులు పులుముకుంటున్న నన్ను, వరండాలో చల్లని వర్షపు జల్లుల్లో తడిసి ముద్దవుతున్న నూరువరహాలూ, రాధామనోహరాలూ ఆత్మీయంగా పలకరించేవి. "మేము పనిగట్టుకుని వర్షంలో తడిసినా జలుబు చేస్తుందని అమ్మ చేత చివాట్లు తినక్కర్లేదోచ్" అన్నట్లు నాకేసి ఒకింత గర్వంగా చూసేవి. ఉక్రోషంతో ఒక్కోసారి వేస్తున్న బొమ్మల్నీ, చదువుతున్న చందమామల్నీ ప్రక్కన పడేసి వెళ్ళి వాటిని పట్టుకుంటే చల్లని వానచినుకులు బుగ్గల్ని ముద్దాడుతూ ఉక్కిరిబిక్కిరి చేసేవి. ఆ చల్లని చిరు స్పర్శ ఇప్పటికీ ఎంత తాజాగా ఉందో ! 

Young Woman at the Window by Salvador Dali

మనుషులతో పేచీలేదు గానీ మౌనం వాళ్ళని ఇబ్బంది పెడుతుంది. మౌనానికి వాళ్ళకు తోచిన వక్రభాష్యాలద్ది గర్వమనో,అహంకారమనో,కలుపుగోలుతనం లేదనో ట్యాగ్ లు తగిలిస్తే సంజాయిషీలు ఇచ్చే అలవాటు లేకపోయినా "అవేమీ కాదు బాబోయ్. మనుషులంటే ఇష్టమే,మాట్లాడడమే కష్టం" అని అప్పుడప్పుడూ అరిచి చెప్పాలనిపిస్తుంది. కానీ ప్రకృతితో ఈ పేచీలేవీ ఉండవు, తమ ఉనికిని డప్పు కొట్టుకుని చాటుకోనవసరం లేకుండా స్థిర గంభీరంగా మానవాళిని గమనిస్తూ ఉండే కొండాకోనలూ, నిశ్శబ్దంగా దారిచేసుకుని ప్రవహించే వాగువంకలూ మన మౌనాన్ని గౌరవిస్తాయి,గౌరవించడమే కాదు ఆ మౌనంలో దొర్లిపోతున్న మాటల్ని ఒడిసిపట్టుకుని మరీ వింటాయి. ప్రకృతికి సంజాయిషీలు అఖ్ఖర్లేదు, నా ఇజం,నా నైజం,నా స్వభావం అంటూ నిరంతరం నిరూపణల అవసరం లేదు. అందుకేనేమో నాలాంటి చాలా మందికి ప్రకృతిని మించిన ప్రియ సఖి లేదు. 

'నో మాన్ ఈజ్ ఆన్ ఐలాండ్' అన్న నానుడిని నిర్ద్వందంగా అంగీకరించినా, నాకెప్పుడూ బుర్రలో ఒక ప్రశ్న తొలుస్తూ ఉంటుంది. అసలు ఆదర్శ జీవన విధానం అంటే ఏమిటి ? దానికో స్పష్టమైన నిర్వచనం సాధ్యమేనా ! ప్రకృతితో మమేకమై జీవించడమే పరమావధి అని కొందరంటారు. మానవాళికి దూరంగా ఉలిపికట్టెలా జీవించడం కూడా ఒక జీవితమేనా అని మరికొందరంటారు. ఎవరి నిర్వచనాలు వారివి. ఆదర్శం కదాని అందరూ ఉన్నపళంగా పట్టణాల్ని వదిలి ప్రకృతికి దగ్గరగా జీవించడం మొదలుపెట్టినా,పల్లెల్ని వదిలి అందరూ పట్టణాలకు వలస వెళ్ళినా సామజిక సమతౌల్యం దెబ్బతింటుంది. కోవిడ్ సెకండ్ వేవ్ నేర్పిన పాఠాల్లో ముఖ్యమైన పాఠం ఏమిటంటే, ఎక్కడి వాళ్ళక్కడ,తామున్న చోటే సంతోషాన్ని తయారుచేసుకోవాలి, తమ చుట్టూ ఉన్న సాధారణ ప్రపంచాన్నే అసాధారణంగా మలుచుకోవాలి. ఇది సాధ్యపడాలంటే మనకు బాహ్య ప్రభావాలకు లోనుకాని ఘనమైన అంతః ప్రపంచం ఉండి తీరాలి. లేదంటే ఉందో లేదో తెలియని రేపటిరోజు కోసం నిరీక్షిస్తూ, లాక్డౌన్ శృంఖలాలు తెంచుకునే సమయంకోసం వేచి చూస్తూ నిరాసక్తంగా,నిస్తేజంగా రోజుల్ని వెళ్ళదీయడం తప్ప మరో గత్యంతరం లేదు. కానీ ఇంత అశాశ్వతత్వం మధ్య మనదైన ఒకే ఒక్క జీవితంలో ఒక్క క్షణాన్నైనా జారవిడుచుకోవడం ఎంత మూర్ఖత్వమో కదా !

పొట్ట చేతపట్టుకుని ఊరూరా తిరిగే ఉద్యోగం మాలో ప్రాంతీయాభిమానాల్ని సమూలంగా చెరిపేసింది. ఈ ప్రాంతం, ఈ సమూహం, ఈ క్షణం : ఇంతవరకే మా ఆలోచనల్ని పరిమితం చేసింది. బహుశా ఈ కారణంగానే మహానగరాల్లో రద్దీనీ, దుమ్మూధూళీ కలగలిసిన పెట్రోల్ వాసనల్ని ఎంతగా ఇష్టపడేవాళ్ళమో, నిర్మానుష్యంగా ఉండే పచ్చని అడవి దారుల్ని కూడా అంతే ఇష్టపడేవాళ్ళం. ప్రకృతిలోనైనా, జనారణ్యంలోనైనా ఒకే తీరుగా జీవించడం నేర్చుకున్నాం. మాల్స్ పట్టి తిరగడం అలవాటైన ప్రాణాలైనా అడవులు పట్టి ఇంకొంచెం ఎక్కువ ఇష్టంగానే తిరిగాం. దేవలోకంలో ఉన్న కాలంలో ప్రతీ వారాంతం క్రమం తప్పకుండా లాంగ్ డ్రైవ్ లకు వెళ్ళేవాళ్ళం. కనుచూపు మేర పచ్చని తివాచీలా పరుచుకున్న తేయాకు తోటల్ని దాటుకుంటూ నీలగిరుల్లో లయబద్ధంగా కురిసే వర్షపు చినుకుల్నీ, కొండల్ని  చీల్చుకుంటూ ప్రవహించే మేఘాల్నీ, తనువంతా తడిసి పులకరిస్తున్న ప్రకృతి అందాల్నీ కళ్ళు విప్పార్చుకుని చూస్తూ ప్రయాణిస్తుంటే వెనుకనుండి కార్ హారన్లు పదపదమంటూ తొందర పెట్టేవి. మేము ప్రక్కకి తొలిగి వాళ్ళకి దారిచ్చేవాళ్ళం. గమ్యాన్ని చేరుకోవాలని వాళ్ళకి ఉన్న తొందర మాకు ఎప్పుడూ లేదు. ప్రయాణాన్ని ఆస్వాదించడమే మా పరమావధి. నలుగురూ సౌకర్యవంతంగా నడిచే దారుల్లో నడవకపోవడంతో ఎవరి కంటాపడని కొన్ని అరుదైన ప్రాకృతిక ప్రదేశాలు మాకు మాత్రమే కనిపించేవి. మనిషి జాడలేని అటువంటి ప్రదేశాల్లో గంటల తరబడి స్వేచ్ఛాజీవుల్లా విహరించేవాళ్ళం. కారాపి ఫ్లాస్కులో వెంట తెచ్చుకున్న ఫిల్టర్ కాఫీ తాగుతుంటే "ఇక్కడ క్షేమం కాదు ఏనుగులు తిరిగే ప్రదేశాలని" ఫారెస్ట్ పెట్రోలింగ్ వాళ్ళు మమ్మల్ని సున్నితంగా హెచ్చరించేవారు. నీలాల నింగీ, కాళ్ళ క్రింద నేలా,పచ్చని పశ్చిమ కనుమలూ,వాటిపై ప్రవహిస్తున్న మేఘాల సాక్షిగా మా అనుభవాల పెట్టెలో అలా చేరిన అదృష్టాలెన్నో. ఎవరైనా ఫోటోలు చూసి "ఈ ప్రదేశం ఎక్కడ ?" అని అడిగితే మాత్రం స్పష్టమైన చిరునామా చెప్పడానికి తడబడేవాళ్ళం. మాకు ప్రయాణమే తప్ప గమ్యాల ఆచూకీ తెలియదు. పారిజాతాల్ని తలపించే కాఫీ పూల పరిమళాలూ, తేయాకు,అరటి తోటల పచ్చదనాలూ, పచ్చని పచ్చి మిరియాల కారాలూ,రోజ్ ఆపిల్స్ తో చేసే కేరళ పానీయాలూ, ఋతువులతో పాటు మారిపోయే అనంతమైన ప్రకృతి వర్ణాలూ, కనీకనిపించని పొగమంచు దారులూ ఇలా జ్ఞాపకాల తుట్టె కదిపితే ఎన్ని అనుభవాలని ! 

మనకి కొత్తొక వింత, పాతొక రోత. ఒకనాడు ఎదుగూ బొదుగూ లేని జీవితాలెందుకని ఆధునికత బాటపట్టి పల్లెల్నీ,ప్రకృతినీ వదిలి పట్టణాలకు వలసపోయాం. ఇప్పుడు పట్టణాలు జనసందోహంతో కిక్కిరిసిపోయి మనిషికి ఏకాంతం కరువైంది. ఇది మెజారిటీ జీవన విధానంగా మారింది. వినియోగదారీ వ్యవస్థ పెచ్చుమీరిన ఈ కాలంలో ఒకనాటి సాంప్రదాయ జీవన శైలులే 'ఓల్డ్ వైన్ ఇన్ న్యూ బాటిల్' లా మినిమలిజం,సింపుల్ లివింగ్ లపేరిట మళ్ళీ ప్రచారంలోకి వచ్చాయి. ఈకాలంలో ఇలా జీవించేవాళ్ళు ప్రివిలెజ్డ్ క్లాస్ (?) గా పరిగణింపబడుతున్నారు. మళ్ళీ ఈ జీవన విధానం విసుగుపుడితే ఆధునికతను ఆనందంగా హత్తుకుంటాం. ఈ చక్ర భ్రమణాలు నిరంతరాయంగా సాగుతూనే ఉంటాయి. ఒంటరితనం తప్ప ఏకాంతానికి అర్ధం తెలీని నేటి తరానికి కోవిడ్ సెకండ్ వేవ్ కటువుగానైనా కొన్ని కొత్త పాఠాలు నేర్పింది. నీలోపలున్న అంతులేని అంతః ప్రపంచాన్నోదిలి బాహ్య ప్రపంచంలో నలుదిక్కులకూ పరిగెడతావేమని ప్రశ్నించింది. వెతికి వెతికి అలసిపోవలసిందే గానీ నీలో లేని సంతోషం,నువ్వు నీతో చెయ్యని స్నేహం నీకు బయట దొరకదని నిరూపించింది. కోరుకున్నది కాకపోయినా కోవిడ్ ముందు నుండే 'సోషల్ డిస్టెన్సింగ్' అలవాటు ఉంది కాబట్టి ఎప్పటిలాగే పుస్తకాలూ, సినిమాలూ, పెయింటింగ్, సంగీతం లాంటి హాబీలతో లాక్డౌన్ సమయం మాకు ఆనందంగానే గడిచిపోయింది. నిజానికి ఈ కళారూపాలన్నీ లేకపోతే ఈ లాక్ డౌన్ రోజుల్లో ఏమైపోయేవాళ్ళమో అనిపించేది. ఇవన్నీ మానవసంబంధాలకి ప్రత్యామ్న్యాయాలు కాదు కానీ, మనిషిని అతడి అంతః ప్రపంచంతో దగ్గరగా కలిపి ఉంచే సాధనాలు. నిజానికి ఉన్నచోటు నుండి కదలకుండా, విసాలూ,పాస్స్పోర్టుల అవసరం లేకుండా, రెక్కలుకట్టుకుని విశ్వం నలుమూలలూ చుట్టి రావడానికి పుస్తకపఠనాన్ని మించిన మరో మంచి మార్గం ఉందా ! కాలంతో బాటు వేగంగా పరిగెత్తడం తప్ప ఒక్క క్షణం చుట్టూ ఉన్న ప్రపంచాన్ని చూడలేని ఈ మెటీరియలిస్టిక్ తరంలో మేరీ ఆలీవర్,వెండెల్ బెర్రీ,హెన్రీ డేవిడ్ థోరో, ఎమెర్సన్, రస్కిన్ బాండ్ లాంటి అనేకమంది రచయితలు ప్రకృతితో తమ సాన్నిహిత్యం గురించి గంటల కొద్దీ చెప్పే కబుర్లకి సరిసాటి అయిన మరో సాహచర్యం నాకైతే ఇంతవరకూ దొరకలేదు. బైరన్ అన్నట్లు "I love not man the less, but nature more" అనుకున్న సందర్భాలెన్నో. 'హ్యాపీనెస్ ఈజ్ ఎ స్టేట్ ఆఫ్ మైండ్' అనే సిద్ధాంతాన్ని మనసావాచాకర్మణా నమ్ముతాను. మనం అందరం ఎక్కువ సమయం (బహుశా పూర్తి సమయం) గడిపేది మన మెదడులోనే కాబట్టి ఆ ప్రపంచాన్ని శుభ్రంగా, అందంగా, ఆనందంగా ఉంచుకోవడం చాలా అవసరం, అది ప్రకృతిలోనైనా,పదుగురిలోనైనా సరే అనుకుంటాను. మా సంతోషాన్ని మేము తయారుచేసుకున్న రెసిపీలో కీలకమైన పదార్థం 'ఆర్ట్'. ఇది మా రెసిపీ మాత్రమే, మీకు నచ్చాలని రూలేమీ లేదు సుమా !

ఈ సందర్భంలో ఫ్రెంచ్ తత్వవేత్త మొంటైన్ ఏకాంతాన్ని గురించి చెప్పిన కొన్ని విలువైన మాటలు ప్రస్తావించాలి : "వివేకవంతుడు నలుగురిలోనైనా, నాలుగ్గోడల మధ్య ఏకాంతంలోనైనా ఎక్కడైనా ఆనందంగానే ఉంటాడు. కానీ అతడు అవకాశం ఉంటే మాత్రం నిస్సందేహంగా ఏకాంతాన్ని కోరుకుంటాడు. సమాజంలో భాగమైన చెడును ఎదుర్కునే క్రమంలో ఎంతో కొంత మకిలి అంటకుండా దాని ప్రభావంనుండి తప్పించుకోవడం అసాధ్యం అని అతడికి స్పష్టంగా తెలుసు. ఇక్కడ రెండే మార్గాలుంటాయి :ఒకటి, మనం సమూహాల్ని వాటి చెడుతో సహా అనుసరించాలి ;రెండు, వారిని ద్వేషిస్తూ వారినుండి విడివడి జీవించాలి. రెండు మార్గాలూ హాని కారకమే." . కానీ నాకు ఆయన మాటలతో చిన్న పేచీ ఉంది. రెండవ మార్గంలో ఎవర్నీ ద్వేషించకుండా కూడా విడివడి మనకు నచ్చినట్లు జీవించే అవకాశం ఉంది కదా ! అనుకుంటాను. కానీ ప్రస్తుతం మనందరం ఉన్న పరిస్థితుల్లో, దీనికంటే ముఖ్యమైన ప్రశ్న : అసలు మనకా ఛాయిస్ ఉందా ? 

తొలి ప్రచురణ - హైదరాబాద్ బుక్ ట్రస్ట్ పేజీ : 30th July'2021 

https://www.facebook.com/HBTBooks/posts/4281019705280995